ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-21T04:13:52+05:30 IST
వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో మిషన్ భగీరథ పథకంలో ఫిట్టర్ వర్కర్గా పనిచేస్తున్న షేక్.ఖాసీం(29) ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వైరా, జూలై 20: వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో మిషన్ భగీరథ పథకంలో ఫిట్టర్ వర్కర్గా పనిచేస్తున్న షేక్.ఖాసీం(29) ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలనే తల్లి మృతిచెందటం ఆతర్వాత ఇతరత్రా కారణాలతో అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆదివారం రాత్రి ఇంట్లో పురుగులమందు తాగి పడుకున్నాడు. సోమవారం ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న ఖాసీంను ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా రాత్రి మృతిచెందాడు. ఆమేరకు వైరా ట్రెయినీ ఎస్ఐ యాయాతి రాజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.