మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-03T06:01:49+05:30 IST
మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రామన్నపేట, డిసెంబరు2: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. రామన్నపేట పట్టణానికి చెందిన గొరిగె యాదయ్య కుమారుడు గొరిగె మత్స్యగిరి(25) హైదరాబాద్లో ఓ ప్రయివేట్ కంపేనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొవిడ్ నిబంధనల మేరకు రెండు నెలల క్రితం వరకు వర్క్ఫ్రం హోం కింద రామన్నపేట నుంచే పనిచేశాడు. అనంతరం మత్స్యగిరిని ఉద్యోగం నుంచి తొలగించారు. రెండు నెలల నుంచి ఎక్కడా ఉద్యోగం దొరక్క మనస్తాపంతో మంగళవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గమనించి, రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మత్స్యగిరి తండ్రి యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.