కాగా.. బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో పేలుడు ఉదయం సమయంలో జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవనాలు ధ్వంసమయ్యాయి. అలాగే ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, ఘటనాస్థలిలో మానవ అవశేషాలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అనుమానితుడిగా భావిస్తున్న63 ఏళ్ల వ్యక్తే చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.