కాంగ్రెస్కు నేనే గుడ్బై చెబుతున్నా: రాథోడ్ రమేశ్
ABN , First Publish Date - 2021-03-01T09:00:35+05:30 IST
కాంగ్రెస్ పార్టీలో తనకు సభ్యత్వం లేకున్నా ఎలా సస్పెండ్ చేస్తారని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ప్రశ్నించారు.
- సభ్యత్వం లేకున్నా సస్పెండ్ చేస్తారా?
ఉట్నూర్, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్ పార్టీలో తనకు సభ్యత్వం లేకున్నా ఎలా సస్పెండ్ చేస్తారని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ప్రశ్నించారు. తానే కాంగ్రెస్కు గుడ్బై చెబుతున్నానని అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో ఆయన మాట్లాడారు. టీపీసీసీ క్రమ శిక్షణ చర్యల కమిటీ చైర్మన్ కోదండరెడ్డి విడుదల చేసిన సస్పెన్షన్ ప్రకటనపై రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ‘డీ’ టీంగా కొనసాగుతున్న నాయకులు అసత్య ప్రచారంతో తనపై ఫిర్యాదులు చేశారని.. అధిష్ఠానం తనను సంప్రదించకుండా.. షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా చర్యలు ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పటికీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జిల్లా పర్యటన వివరాలు ఇవ్వలేదన్నారు. ఒక హిందువుగా వివేకానంద జయంతి, ఛత్రపతి శివాజీ జయంతిలకు వెళ్లడం తప్పా..? అని ప్రశ్నించారు.