స్టాంపుల గల్లంతులో ఇద్దరి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-10-27T05:20:24+05:30 IST

తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కలకలం రేపిన స్టాంపుల గల్లంతు వ్యవహారంలో ఇద్దరు ఉద్యో గులపై వేటు వేశారు.

స్టాంపుల గల్లంతులో ఇద్దరి సస్పెన్షన్‌

తాడేపల్లిగూడెం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో కలకలం రేపిన స్టాంపుల గల్లంతు వ్యవహారంలో ఇద్దరు ఉద్యో గులపై వేటు వేశారు. ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌గా వ్యవహరించిన జే.రత్న కుమార్‌, స్టాంపుల అమ్మకం నిర్వహించిన ష్రాఫ్‌ పరంజ్యోతిని సస్పెండ్‌ చేశా రు. స్థానిక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సుమారు రూ.57,800 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులు గల్లంతయ్యాయి. దీనిపై అప్పటి ఇన్‌చార్జ్‌గా ఉన్న రత్నకుమార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా రిజిస్ర్టార్‌, ఆడిట్‌ జిల్లా రిజిస్ర్టార్‌, డీఐజీ విచారణ చేపట్టి స్టాంపుల గల్లంతైన విషయాన్ని నిర్థారిం చారు. మరో వైపు తనను వేధిస్తున్నారంటూ సరఫ్‌ పరంజ్యోతి ఉన్నతాధికా రులకు, స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదుచేశారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును విచారణ జరిపిన తరువాత తొలగించి నట్లు సమాచారం. మహిళా ఉద్యోగిపై వేధింపుల ఫిర్యాదుపై శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో స్టాంపుల గల్లంతు, పరస్పర ఫిర్యాదులపై ఉన్నతాధికారులకు చర్యలకు ఉపక్రమించారు. ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ రత్న కుమార్‌, ష్రాఫ్‌ పరంజ్యోతిని సస్పెండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-27T05:20:24+05:30 IST