లావాదేవీల నిలిపివేత
ABN , First Publish Date - 2021-05-09T05:31:55+05:30 IST
జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్లో వ్యాపార లావాదేవీలను నిలిపివేశారు.
ఖిల్లా, మే 8: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్లో వ్యాపార లావాదేవీలను నిలిపివేశారు. ప్ర స్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మా ర్కెట్లోని వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. ఈ నెల 16వ తే దీ వరకు వ్యవసాయ మార్కెట్యార్డులో ఎటువంటి పసుపు క్రయవిక్రయాలు జరగవు. రైతులు గమనించి తమ ఉత్పత్తులను 16వ తేదీ వరకు తరలించరాదని వ్యాపారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీన సోమవారం కూరగాయల మార్కెట్సైతం బంద్పాటిస్తున్నారు. కూరగాయల హోల్సేల్ వ్యాపారస్తులు కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఒక్కరోజు వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్శాఖ అధికారులకు నివేదిక ఇచ్చారు. 11వ తేది నుంచి యథావిధిగా కూరగాయల మార్కెట్లో వ్యాపార లావాదేవిలు కొనసాగుతాయని మార్కెట్ సిబ్బంది తెలిపారు.