సీఐ, ఎస్ఐ సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-04-24T05:17:51+05:30 IST
కోడి పందేలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారనే అభియోగం ప్రాథమికంగా నిర్దారణ కావ డంతో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సీఐ రామచంద్ర రావు, ఎస్ఐ పార్థసారథిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఉత్తర్వులు జారీచేశారు.
ఏలూరు క్రైం, ఏప్రిల్ 23 : కోడి పందేలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారనే అభియోగం ప్రాథమికంగా నిర్దారణ కావ డంతో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సీఐ రామచంద్ర రావు, ఎస్ఐ పార్థసారథిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు ఉత్తర్వులు జారీచేశారు. జము లపల్లి, విరప గ్రామాల్లో కోడి పందేల నిర్వహణకు వీరిద్దరూ సహకరించినట్లు అక్కడి జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీఐజీ ఈ నిర్ణయం తీసుకున్నారు.