అథ్లెటిక్స్ కోచ్ నికోలాయ్ అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-03-06T09:14:47+05:30 IST
ఒలింపిక్స్ సన్నాహకాల్లో ఉన్న భారత అథ్లెటిక్స్ బృందానికి ఇది చేదువార్త. జాతీయ మిడిల్, లాంగ్ డిస్టెన్స్ కోచ్..
పటియాల: ఒలింపిక్స్ సన్నాహకాల్లో ఉన్న భారత అథ్లెటిక్స్ బృందానికి ఇది చేదువార్త. జాతీయ మిడిల్, లాంగ్ డిస్టెన్స్ కోచ్ నికోలాయ్ స్నెసరేవ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఇండియన్ గ్రాండ్ ప్రీ పోటీల కోసం బెంగళూరు నుంచి శుక్రవారమే ఇక్కడికి వచ్చిన నికోలాయ్.. ఎన్ఐఎస్ హాస్టల్ గదిలో అచేతనంగా పడి ఉండగా గుర్తించినట్టు జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు తెలిపాడు. పోస్ట్మార్టమ్ నిమిత్తం నికోలాయ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన వెల్లడించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బెలార్సకు చెందిన 72 ఏళ్ల నికోలాయ్ రెండేళ్ల క్రితం భారత అథ్లెటిక్స్ కోచ్గా పనిచేశాడు. టోక్యో క్రీడల నేపథ్యంలో ఇటీవలే అతడు మళ్లీ భారత కోచ్గా నియమితుడయ్యాడు.