TS News:సంగారెడ్డి జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-07-22T23:49:45+05:30 IST

జిల్లాలో జోగిని(jogini) అనుమానాస్పద మృతి(suspicious death) సంచలనం రేపుతోంది. జిల్లాలోని మారేడ్‌పల్లిలో జరిగిన బోనాల

TS News:సంగారెడ్డి జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి

సంగారెడ్డి: జిల్లాలో జోగిని(jogini) అనుమానాస్పద మృతి(suspicious death) సంచలనం రేపుతోంది. జిల్లాలోని మారేడ్‌పల్లిలో జరిగిన బోనాల జాతర( Bonala Jatara)కు జోగినిలు వెళ్లారు వీరితో పాటు జోగిని దీపికా(Deepika) వెళ్లింది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న దీపికా అనుమానాస్పదంగా మృతిచెందింది. అయితే ఈ మృతిపై జోగినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపికా మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మారేడ్‌పల్లి నుంచి గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) మార్చురీకి అంబర్‌పేట్ పోలీసులు(Amberpet Police) తరలించారు. గాంధీ ఆస్పత్రి వద్ద జోగినిలు నిరసన తెలిపారు. దీపికాను సాయిహర్ష అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుడిని తప్పించడానికి పోలీసులు, లింగంపల్లి (Lingampally)లోని ఓ హాస్పిటల్ వైద్యులు ప్రయత్నిస్తున్నారని జోగినిలు ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే జోగిని దీపికాను సాయిహర్ష హత్య చేశారని అంటున్నారు. దీపికా మృతదేహాన్ని నాగోల్‌( Nagol) లోని సాయిహర్ష ఇంటివద్దకు తీసుకు వెళ్లి ధర్నా చేస్తామని జోగినిలు తెలిపారు. 

Updated Date - 2022-07-22T23:49:45+05:30 IST