స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2021 ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-05T05:59:21+05:30 IST
స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో పాల్గొని జిల్లాని ప్రథమస్థానంలో నిలపాలని కలెక్టర్ వివేక్యాదవ్ విజ్ఞప్తి చేశారు.
గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో పాల్గొని జిల్లాని ప్రథమస్థానంలో నిలపాలని కలెక్టర్ వివేక్యాదవ్ విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2021 కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. ప్రతీ గ్రామం స్వచ్ఛత అంశాలపై సర్వే జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ - 2021 యాఫ్ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఎస్ఎస్జీ-2021 అని టైపు చేసి మొబైల్యాప్ని డౌన్లోడింగ్ చేసుకోవాలన్నారు. మొబైల్ నెంబరు నమోదు చేసుకొన్న తర్వాత అందులో సూచించిన 5 ప్రశ్నలకు అవును/కాదు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత సబ్మిట్ నొక్కాలని సూచించారు. ఈ సర్వే గురించి సందేహనివృత్తి కోసం గ్రామంలో ఉన్న సంబంధిత వార్డు వలంటీర్/ఇంజనీరింగ్ అసిస్టెంట్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.