సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
ABN , First Publish Date - 2022-10-04T05:12:59+05:30 IST
సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంగారెడ్డి అర్బన్, అక్టోబరు 3: సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి వీరభద్రనగర్లో చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. అంతకుముందు బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా కో-ఆర్డినేటర్ డాక్టర్ అరుణ, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, చంద్రశేఖర్, జగన్, జిల్లా నాయకులు హన్మంతరెడ్డి, మహేందర్, నర్సారెడ్డి, మురళీధర్రెడ్డి, దయాకర్రెడ్డి, పవన్, యశ్వంత్, పట్టణాధ్యక్షుడు రవిశంకర్, నర్సింహరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.