ఆదిభట్ల మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ -2022 అవార్డు
ABN , First Publish Date - 2022-09-26T04:59:03+05:30 IST
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదిభట్ల మున్సిపాలిటీ
ఆదిభట్ల, సెప్టెంబర్ 25: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆదిభట్ల మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డుకు ఎంపికైంది. పారిశుధ్య నిర్వహణలో భాగంగా తడి పొడి చెత్తను వేరుచేస్తూ మున్సిపాలిటీని స్వచ్ఛత వైపు నడిపించినందుకుగాను ఈ అవార్డును అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 1న న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. కాగా స్వచ్చ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా మున్సిపాలిటీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యకం చేశారు.