వివేకానంద డే క్యాంపెయిన్‌కు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మద్దతు

ABN , First Publish Date - 2021-12-01T01:44:03+05:30 IST

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు.

వివేకానంద డే క్యాంపెయిన్‌కు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మద్దతు

హైదరాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. క్యాంపెయిన్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన వివేకానంద పోస్టర్‌పై ఆయన సంతకం పెట్టారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రామకృష్ణ మఠం వాలంటీర్లు నారాయణ రావు, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


1893లో హైదరాబాద్ పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో ఫిబ్రవరి 13న మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగించారు. యూరోపియన్లు, నిజాం కొలువులోని మేధావులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న బహిరంగసభను ఉద్దేశించి వివేకానంద తొలిసారిగా ఆంగ్లంలో ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో వివేకానందలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అదే స్ఫూర్తితో ఆయన చికాగో వేదికపై ప్రసంగించి విజయవంతమయ్యారు. వివేకానందలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేసిన ఫిబ్రవరి 13ను వివేకానంద దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు కోరుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వారోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అందరి మద్దతునూ కూడగడుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా వివేకానంద డే కు మద్దతు తెలిపేందుకు కింది లింక్‌పై క్లిక్ చేయాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు సూచిస్తున్నారు. 

                           ఈ లింక్‌పై క్లిక్ చేయండి


Updated Date - 2021-12-01T01:44:03+05:30 IST