18 టీంలతో కొనసాగుతున్న స్వమిత్వ సర్వే
ABN , First Publish Date - 2022-07-06T05:35:12+05:30 IST
దోమకొండలో 18 ప్రత్యేక బృందాలతో స్వమిత్వ సర్వే కొనసాగుతుందని ఎంపీడీవో చిన్నారెడ్డి మంగళవారం తెలిపారు.
దోమకొండ, జూలై 5: దోమకొండలో 18 ప్రత్యేక బృందాలతో స్వమిత్వ సర్వే కొనసాగుతుందని ఎంపీడీవో చిన్నారెడ్డి మంగళవారం తెలిపారు. స్వమిత్వ సర్వే ద్వారా దోమకొండ పట్టణం మొత్తం పూర్తి కొలతలు, ఇళ్లు, ప్లాట్లకు సంబంధించి వివరాలు జీపీలో నమోదై ఉంటాయాన్నారు. మొదటగా దోమకొండను ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారని, అందులో భాగంగా దోమకొండలో 180 మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొన్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు సర్వే కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో తిరుపతిరెడ్డి, కార్యదర్శులు సౌజన్య, రమెష్, భానుశ్రీ, అరుణ, మమత, గంట హర్షిత్, వెన్నెల, రాహుల్గౌడ్, అంజిబాబు, రాజశేఖర్, సుధాకర్, బాలకిషన్గౌడ్, నవీన్, భరత్, శ్రీనివాస్, శ్రీనివాస్,ప్రశాంత్, రాజేందర్, రవి, గణేష్, జీవన్, క్రిష్ణ, సందీప్, దర్శన్, సుధీర్, స్వామి, నవీన్, వీఆర్ఏలు, తదితరులు పాల్గొన్నారు.