ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయండి: స్వరూపానందేంద్ర స్వామి

ABN , First Publish Date - 2022-05-14T21:38:01+05:30 IST

ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచించారు...

ఆది శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేయండి: స్వరూపానందేంద్ర స్వామి

తిరుపతి: ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో జగద్గురు ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. తిరుపతిలో జరిగిన గంగమ్మ జాతర ఉత్సవంలో స్వరూపానందేంద్ర స్వామి, ఆదిశంకరాచార్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపాలని తిరుపతి mla భూమన కరుణాకర్ రెడ్డికి సూచించారు.


తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిలతీర్ధం పరిసర ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. స్వరూనంద స్వామి సూచనపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి... తిరుపతి నగరంలో తప్పనిసరిగా ఆది శంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు chesenduku చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read more