దుర్గమ్మ సేవలో స్వాత్మానందేంద్ర స్వామి
ABN , First Publish Date - 2020-12-01T06:28:09+05:30 IST
దుర్గమ్మ సేవలో స్వాత్మానందేంద్ర స్వామి
విజయవాడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీస్వామి సోమవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేదపండితులు, అర్చకులు స్వామీజీకి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆయన అనుగ్రహభాషణం చేశారు. ఈవో ఎంవీ సురేష్బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు అమ్మవారి ప్రసాదాలు, పండ్లు సమర్పించారు.