స్వాత్మానందేంద్ర సరస్వతితో సినీ నటుడు మోహన్బాబు భేటీ
ABN , First Publish Date - 2021-10-05T02:15:44+05:30 IST
నగరంలోని విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయం ఫిలింనగర్ దైవ సన్నిధానాన్ని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర
హైదరాబాద్: ఫిలింనగర్లోని దైవ సన్నిధానాన్ని సందర్శించిన విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు భేటీ అయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ కూడా అయిన మోహన్బాబు ఈ సందర్భంగా ఆలయాభివృద్ధికి చేపడుతున్న చర్యలపై స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో చర్చించారు.
ఈ ఉదయం దైవ సన్నిధానాన్ని సందర్శించిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ విధానాలపై అర్చకులు, పండితులతో చర్చించారు. ప్రత్యేక హోమాలు, పూజల ద్వారా భక్తులకు చేరువ కావాలని, దసరా నవరాత్రుల్లో, కార్తీక మాసంలో వైభవోపేతంగా చేపట్టాలని సూచించారు.
విశిష్టమైన వైదిక కార్యక్రమాలను ఏటా చేపట్టేలా ప్రణాళిక రచించాలన్నారు. ఆలయాభివృద్ధికి అర్చకులంతా సమష్టి కృషి చేయాలని సూచించారు. కాగా, మోహన్బాబు కుమారుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. పోటీ నుంచి సీవీఎల్ తప్పుకోవడంతో ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది.