కంద దోశలు

ABN , First Publish Date - 2020-09-09T21:09:28+05:30 IST

కంద - పావు కేజి, పెసరప్పు - ఒక కప్పు, బియ్యం - అర కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు

కంద దోశలు

కావలసిన పదార్థాలు: కంద - పావు కేజి, పెసరప్పు - ఒక కప్పు, బియ్యం - అర కప్పు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం - అంగుళం ముక్క, పచ్చిమిర్చి - 4, నూనె - కాల్చడానికి.


తయారుచేసే విధానం: పెసరపప్పు, బియ్యం విడివిడిగా 3 గంటలు నానబెట్టాలి. తొక్కతీసి తరిగిన కందతో పాటు పప్పు, బియ్యం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు - కలిపి మిక్సీలో దోశల పిండిలా రుబ్బుకోవాలి. తర్వాత పెనంపై నూనె రాసి కొంచెం దళసరిగా దోశలు పోసుకోవాలి. ఈ దోశలు చట్నీలేకుండా వేడి వేడిగా తిన్నా బాగుంటాయి. 




Updated Date - 2020-09-09T21:09:28+05:30 IST