ఆ జ్ఞాపకాలెంతో మధురం..
ABN , First Publish Date - 2022-08-15T05:00:32+05:30 IST
హైస్కూలులో చదువుకున్న రోజుల్లో ఆనాటి మధురమైన జ్ఞాపకాలు ఇప్పటికీ మరువలేకున్నామని పెనగలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్నారు. 25 ఏళ్ల కిందట విద్యనభ్యసించిన 1996-97 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో గెట్టు గెదర్ కార్యక్రమం నిర్వహించారు.
గెట్టు గెదర్లో పూర్వ విద్యార్థులు
పెనగలూరు, ఆగస్టు 14: హైస్కూలులో చదువుకున్న రోజుల్లో ఆనాటి మధురమైన జ్ఞాపకాలు ఇప్పటికీ మరువలేకున్నామని పెనగలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు అన్నారు. 25 ఏళ్ల కిందట విద్యనభ్యసించిన 1996-97 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో గెట్టు గెదర్ కార్యక్రమం నిర్వహించారు. ఆ నాటి గురువులు ఎం.రమణారెడ్డి, కరుణాకర్రెడ్డి, సాంబశివరెడ్డి, పి.నరసింహులు, జి.వి.భాస్కర్రెడ్డి, జి.రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసులు, షబ్బీర్ అలీలను ఘనంగా సన్మినించి జ్ఞాపకాలను బహూకరించారు.