ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే...నేటి నుంచి అదనపు భారం
ABN , First Publish Date - 2022-01-01T13:43:40+05:30 IST
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే...నేటి నుంచి అదనపు భారం పడనుంది...
స్విగ్గీ, జోమాటో సేవలపై 5 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ:ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే...నేటి నుంచి అదనపు భారం పడనుంది.కొత్త సంవత్సరంలో విజయ పాల ధరలతో ఏటీఎం సేవలపై పన్నులు పెరిగాయి.కొత్త ఏడాదిలో మొబైల్ చార్జీలు కూడా పెరిగాయి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లు స్విగ్గీ, జోమాటో సేవలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి.క్లౌడ్ కిచెన్లు, సెంట్రల్ కిచెన్లు అందించే సేవలు రెస్టారెంట్ సర్వీస్ కింద కవర్ చేస్తూ శనివారం నుంచి ఐదు శాతం సేవల పన్ను చెల్లించాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ మేర జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.జీఎస్టీ పన్ను చెల్లించని రెస్టారెంట్లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం హెచ్చరించింది.
గతంలో రెస్టారెంట్లు స్వయంగా పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసేవి. కానీ ఇప్పుడు వాటిని ట్యాక్స్మెన్కు చెల్లించే బాధ్యత డెలివరీ ప్లాట్ఫారమ్లైన స్విగ్గీ, జోమాటోలపై ఉంటుంది.ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లలో జాబితా చేసిన పలు రెస్టారెంట్లు కస్టమర్ల నుంచి జీఎస్టీని వసూలు చేస్తున్నప్పటికీ పన్నులను ఎగవేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత డబ్బులు చెల్లించే సమయంలో జీఎస్టీ పేరిట అదనపు చార్జీలు వసూలు చేసే పరిస్ధితి నెలకొంది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది.