యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా

ABN , First Publish Date - 2021-03-01T05:21:28+05:30 IST

ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది.

యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా

సంగారెడ్డి రూరల్‌, ఫిబ్రవరి 28 : ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. రూరల్‌ ఎస్‌ఐ సుభాష్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ టోలీచౌకికి చెందిన ఖాజా మోహినోద్దీన్‌(23) కొంతకాలంగా సంగారెడ్డి పట్టణంలోని ఇందిరా కాలనీలో గల మజీద్‌ ఎఫై మున్నీస మదర్సాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అయితే మదర్సాలోని నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం సంగారెడ్డి మండలం కల్పగూర్‌ గ్రామ శివారులోని మంజీరా డ్యాంలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయాడు. మృతుని తల్లి నసీమాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుభాష్‌ తెలిపారు.

Updated Date - 2021-03-01T05:21:28+05:30 IST