తాగునీటిపై ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2022-07-08T03:22:04+05:30 IST
ఉదయగిరిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు
ఉదయగిరి, జూలై 7: ఉదయగిరిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఆనకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సామ్రాజ్యం, ఉప సర్పంచి ముర్తుహుస్సేన్, మండల వైసీపీ కన్వీనర్ అక్కి భాస్కర్రెడ్డి, నాయకులు దస్తగిరి, లక్ష్మయ్య, రామయ్య, జబ్బార్, జబీ, ఉప్పుటూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.