తాకట్టు రుణాలపై దర్యాప్తు

ABN , First Publish Date - 2021-01-22T05:56:48+05:30 IST

పంట తాకట్టుపై సొసైటీల్లో తీసుకున్న ఫ్లెడ్జి రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీసీవో రాజశేఖర్‌ ఆదేశాలిచ్చారు.

తాకట్టు రుణాలపై దర్యాప్తు

గుంటూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పంట తాకట్టుపై సొసైటీల్లో తీసుకున్న ఫ్లెడ్జి రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీసీవో రాజశేఖర్‌ ఆదేశాలిచ్చారు. భట్టిప్రోలు, దోనెపూడి సొసైటీల్లో ఫ్లెడ్జి రుణాలు, పొన్నూరు బ్రాంచ్‌లో బంగారం తాకట్టు రుణాలపై 52వ సెక్షన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని డీసీవో తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత ముమ్మనేని వెంకటసుబ్బయ్య ప్రాతినిధ్యం వహించిన భట్టిప్రోలు సొసైటీలోని రుణాల పంపిణీపై విచారణకు ఆదేశాలు ఇవ్వడంపై కలకలం రేగింది.

Updated Date - 2021-01-22T05:56:48+05:30 IST