అందుకే Congressలో చేరుతున్న..: తాటి Venkateshwarlu

ABN , First Publish Date - 2022-06-24T18:38:37+05:30 IST

టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

అందుకే Congressలో చేరుతున్న..: తాటి Venkateshwarlu

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem): టీఆర్ఎస్ (TRS) నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు (Venkateshwarlu) శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేనిచోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని, తన నియోజక వర్గంలో పోడు భూముల సమస్యను పరిష్కరించ లేదని చెప్పారు. కేసీఆర్ (KCR) కంటే ముందు కూడా తెలంగాణ (Telangana)లో అభివృద్ది జరిగిందన్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్‌లు వేయడం అభివృద్ది కాదని.. తన నియోజకవర్గం ప్రజల పోడు భూములకు పట్టాలు ఇస్తే సంతోషిస్తామన్నారు.


పోడు రైతులకు పట్టాలు, రైతు బంధు, రైతు భీమా ఇవ్వాలని తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాను వైసీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఐదు సార్లు ఫోన్ చేశారని.. ఇప్పుడు సమస్యలు చెప్పడానికి తాను 40 సార్లు ఫోన్ చేసినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం లేనిచోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన మరోసారి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తాటి వెంకటేశ్వర్లు అన్నారు.

Updated Date - 2022-06-24T18:38:37+05:30 IST