‘ఓటీఎ్సను సద్వినియోగం చేసుకోవాలి’
ABN , First Publish Date - 2021-12-05T05:45:51+05:30 IST
ఓటీఎస్ను (వన్ టైం సెటిల్మెంట్) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీనివాసులు అన్నారు.
గోస్పాడు, డిసెంబరు 4: ఓటీఎస్ను (వన్ టైం సెటిల్మెంట్) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీనివాసులు అన్నారు. శనివారం మండలంలోని జూలెపల్లె గ్రామంలోని సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో ఎన్ని ఇళ్లు సర్వే చేశారు, డేటా ఎంట్రీ ఎన్ని నమోదు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు 21న లబ్ధిదారులకు రిజిష్ట్రర్ పట్టాలను అందజేస్తామని అన్నారు. ఆయన వెంట హౌసింగ్ డీఈ సత్యరాజు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.