‘సమీకృత మార్కెట్‌ను వినియోగించుకోవాలి’

ABN , First Publish Date - 2022-06-29T05:30:00+05:30 IST

సమీకృత మార్కెట్‌ను గజ్వేల్‌ ప్రజలు వినియోగించుకోవాలని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ కోరారు.

‘సమీకృత మార్కెట్‌ను వినియోగించుకోవాలి’

గజ్వేల్‌, జూన్‌ 29: సమీకృత మార్కెట్‌ను గజ్వేల్‌ ప్రజలు వినియోగించుకోవాలని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ కోరారు. గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌లో గల 12 మడిగెలకు బహిరంగ వేలం పాటను మార్కెటింగ్‌శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఇఫ్తేకార్‌ నజీబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మడిగెలు దక్కించుకున్న వ్యాపారులు సరైన సమయంలో అద్దెలు చెల్లించి మార్కెట్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వారివెంట జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి రియాజ్‌, మార్కెట్‌ కార్యదర్శి జాన్‌వెస్లీ, వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి, డైరెక్టర్లు మథీన్‌, శిలాసారం ప్రవీణ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-06-29T05:30:00+05:30 IST