వలంటీర్ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోండి
ABN , First Publish Date - 2021-03-03T06:05:00+05:30 IST
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వార్డు వలంటీర్ల సెల్ఫోన్లను సీజ్ చేసి మున్సిపల్ కార్యాయలంలో డిపాజిట్ చేయాలని వార్డు సచి వాలయ అడ్మిన్లకు సాలూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమణమూర్తి ఆదేశిం చారు.
సాలూరు రూరల్/సాలూరు:
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వార్డు వలంటీర్ల సెల్ఫోన్లను సీజ్ చేసి
మున్సిపల్ కార్యాయలంలో డిపాజిట్ చేయాలని వార్డు సచి వాలయ అడ్మిన్లకు
సాలూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమణమూర్తి ఆదేశిం చారు. సాలూరు మున్సిపల్
కార్యాలయ ఆవరణలో మంగళవారం బీఎల్వోలు, వార్డు సచివాలయ సిబ్బందితో ఆయన
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్డు సచివాలయ
సిబ్బంది, బీఎల్వోలు ఏ అభ్యర్థికీ అనుకూలంగా వ్యవరించరాదన్నారు. ఎన్నికల
పారదర్శక నిర్వహణకు అందరూ సహకరిం చాలన్నారు. వివిధ అంశాలను వివరించారు.
ఓటరు స్లిప్ల జాబితాలను బీఎల్వోలకు అందించారు. మేనేజర్ టి.జయరాం తదితరులు
పాల్గొన్నారు.
నెల్లిమర్ల, మార్చి 2:
నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి
కాంతిలాల్ దండే మంగళవారం పరిశీలించారు. నెల్లిమర్లలోని జ్యోతిబాపూలే
బాలికల గురుకుల పాఠశాలలో స్ర్టాంగ్ రూము, ఎన్నికల సామగ్రి పంపిణీ,
రిసెప్షన్ కౌంటర్, లెక్కింపు కేంద్రాలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా నగర
పంచాయతీ ఎన్నికల ప్రత్యేకాధికారి, జేసీ రావిరాల మహేష్కుమార్, కమిషనర్
జె.రామఅప్పలనాయుడు ఏర్పాట్ల గురించి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్
జి.రాము పాల్గొన్నారు. అలాగే గురుకుల పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో
మాట్లాడి ఉపాధ్యాయిని బోధనా తీరును పరిశీలించారు.