విద్యుత్‌ టారిఫ్‌పై రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

ABN , First Publish Date - 2021-01-17T05:50:50+05:30 IST

విద్యుత్‌ చార్జీలపై(టారిఫ్‌) ఈనెల 18 నుంచి ఆం ధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టనున్నది.

విద్యుత్‌ టారిఫ్‌పై రేపటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

ఏలూరుసిటీ, జనవరి 16: విద్యుత్‌ చార్జీలపై(టారిఫ్‌) ఈనెల 18 నుంచి ఆం ధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టనున్నది. 20వ తేదీ వరకు విశాఖపట్నంలో ఏపీఈ ఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్టు ఏపీఈపీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ ఒక ప్రకట నలో పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై నివేదికలను విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్‌సీకి సమర్పిం చాయన్నారు. వినియోగదారులు ఏలూరు సర్కిల్‌ కార్యాలయంతోపాటు తాడే పల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, భీమవరం, నరసాపురం డివిజన్‌ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అభ్యంతరాలను తెలియజేయ వచ్చన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌ఈ జనార్దనరావు తెలిపారు. 


Updated Date - 2021-01-17T05:50:50+05:30 IST