బంజారాహిల్స్లో టీఆర్ఎస్ ఆఫీసుకు భూమి.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు
ABN , First Publish Date - 2022-06-24T00:25:52+05:30 IST
తెలంగాణ ప్రభుత్వాని (Talangana Government)కి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్....
హైదరాబాద్: తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి హైకోర్టు (High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ (Trs) ఆఫీసుకు భూమి కేటాయింపుపై నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ఆఫీసుకు బంజారాహిల్ (BanjaraHills)లో 4 వేల935 గజాల భూమి (Land)ని ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో గజాన్ని రూ.100కు అప్పగించింది. దీంతో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు ఎలా ఇస్తారని ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr)తోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సీఎస్ (Cs), హైదరాబాద్ కలెక్టర్ (Collector)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించాలని గతంలో సీఎం నిర్ణయించారు. ఆ సమయంలో హైదరాబాద్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయించారు. అయితే తక్కువ ధరకు భూమి కేటాయించడంపై అప్పట్లోనే పలువురు విమర్శలు చేశారు. కోట్ల విలువైన స్థలాలను పార్టీ ఆఫీసులకు తక్కువ ధరకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది.