రెండు వైపులా సమస్యలున్నాయి.. పంతాలు, పట్టింపులొద్దు: తలసాని
ABN , First Publish Date - 2022-06-23T15:43:24+05:30 IST
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్కు మధ్య వివాదం ముదిరింది.
Hyderabad : తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్కు మధ్య వివాదం ముదిరింది. ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) ఇరువైపుల పెద్దలతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంతాలు, పట్టింపులు వద్దని చెప్పానని పేర్కొన్నారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కార్మికులకు సమస్యలు ఉన్నాయని.. కరోనాతో వేతనాలు పెరగలేదన్నారు. మధ్యాహ్నం 12కి భేటీ అయ్యి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్టు తలసాని తెలిపారు. ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలంటే.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.