బోనాలకు ముందే దేవాలయాలకు ఆర్థిక సాయం : Talasani
ABN , First Publish Date - 2022-07-12T20:04:38+05:30 IST
బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు
Hyderabad : బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. నేడు ఆయన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డిలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. 3500 కు పైగా ప్రభుత్వ, ప్రయివేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ చేయనున్నట్టు తలసాని వెల్లడించారు. ఈ నెల 17న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజులలో చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. 24వ తేదీన బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18వ తేదీన చెక్కుల పంపిణీ చేస్తామని.. దీనికి ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను తలసాని ఆదేశించారు.