‘తలశిల’ వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

ABN , First Publish Date - 2021-01-17T06:18:01+05:30 IST

‘తలశిల’ వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

‘తలశిల’ వంశీయుల ఆత్మీయ సమ్మేళనం
జడ్జి అనితను సత్కరిస్తున్న మండవ, ప్రభాకరరావు

నాగాయలంక  : తలశిల వంశీయులందరూ కలుసుకోవటం ఆనందంగా ఉందని నాంపల్లి చీఫ్‌ మెట్రో పాలిటన్‌ కోర్టు జడ్జి తలశిల అనిత అన్నారు. జడ్పీ పాఠశాల ఆడిటోరియంలో తలశిల వారి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి అనిత విచ్చేశారు. ఆత్మీయ సమ్మేళనాలతో వంశీకుల్లో ఐక్యత పెంపొందుతుందని ఆమె అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ మండవ బాలవర్ధిరావు, ప్రముఖ కాంట్రాక్టర్‌ తలశిల ప్రభాకరరావు జడ్జిని సత్కరించారు. తలశిల వెంకట చిదంబరరావు, యువ కవయిత్రి సబ్బినేని పద్మజ పాల్గొన్నారు. న్యాయవాది తలశిల అర్జునరావు పర్యవేక్షించారు.  


Updated Date - 2021-01-17T06:18:01+05:30 IST