TS News: ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-08-25T04:53:44+05:30 IST
Hyderabad: ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడినా సహించేది లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రస్తకే లేదన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. గోషమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో
Hyderabad: ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ మాట్లాడినా సహించేది లేదని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రస్తకే లేదన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. గోషమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (RajaSingh) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు సీఎస్ సోమేష్ కుమార్ డీజీపీ మహీందర్ రెడ్డితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అలాగే ప్రజలు కూడా సంయమనం పాటించాలని కోరారు.