తామ్రభరణి నదికి ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-04-16T15:07:19+05:30 IST
తమిళ ఉగాది, గురుపెయర్చి సందర్భంగా శ్రీ వైకుంఠం ప్రాంతంలోని తామ్రభరణి నదికి ప్రత్యేక అభిషేకపూజలు నిర్వహించారు. తొలుత నది తీరం పక్కనే ఉన్న గుణవతిఅమ్మాళ్ ఆలయంలో
పెరంబూర్(చెన్నై): తమిళ ఉగాది, గురుపెయర్చి సందర్భంగా శ్రీ వైకుంఠం ప్రాంతంలోని తామ్రభరణి నదికి ప్రత్యేక అభిషేకపూజలు నిర్వహించారు. తొలుత నది తీరం పక్కనే ఉన్న గుణవతిఅమ్మాళ్ ఆలయంలో ఉత్సవమూర్తులకు అభిషేక, అలంకరణ, పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి పూర్ణకుంభం ఊరేగింపుగా నది వద్దకు తీసుకొచ్చారు. పంచామృతం సహా 21 సుగంధద్రవ్యాలతో అభిషేకం, పూర్ణ కుంభాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకల్లో పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.