తమిళనాడు సీఎం పళనీస్వామికి కరోనా నెగిటివ్

ABN , First Publish Date - 2020-07-14T16:44:31+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనీస్వామితోపాటు సీఎం కార్యాలయ సిబ్బందికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది.

తమిళనాడు సీఎం పళనీస్వామికి కరోనా నెగిటివ్

చెన్నై (తమిళనాడు): తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి కె పళనీస్వామితోపాటు సీఎం కార్యాలయ సిబ్బందికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. కరోనా పాజిటివ్ వచ్చిన మంత్రి సీఎం పళనీస్వామిని కలిసిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా సీఎంతోపాటు కార్యాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో సీఎంకు కరోనా లేదని తేలింది. కొవిడ్ -19 నిబంధనల ప్రకారం తాము సీఎంకు కూడా కరోనా పరీక్ష చేశామని, కరోనా నెగిటివ్ అని తేలిందని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తమిళనాడులో గడచిన 24 గంటల్లో 4,328 కేసులు నమోదైనాయని, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరిందని మంత్రి విజయభాస్కర్ వివరించారు. తమిళనాడులో 2,032 మంది మరణించారని చెప్పారు. చెన్నై నగరంలో అత్యధికంగా 1140 కేసులు బయటపడ్డాయని మంత్రి వివరించారు. 

Updated Date - 2020-07-14T16:44:31+05:30 IST