తండ్రి చనిపోయాడని పిల్లలకు తెలియదు: సాయి తేజ భార్య

ABN , First Publish Date - 2021-12-10T01:26:29+05:30 IST

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట వాసి సాయితేజ మరణించారు. దీంతో ఆయన స్వగ్రామంలో..

తండ్రి చనిపోయాడని పిల్లలకు తెలియదు: సాయి తేజ భార్య

చిత్తూరు: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట వాసి సాయితేజ మరణించారు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నారు.  కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. సాయి తేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయితేజ మరణంతో ఆయన భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. 


సాయితేజ భార్య శ్యామల మాట్లాడుతూ ‘‘ప్రతి రోజులా బుధవారం ఉదయం 8.45నిమిషాలు ఫోన్ చేశాడు.. పాప, బాబు, నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మళ్లీ చేస్తా.. టైమ్ అవుతుందని ఫోన్ పెట్టోశాడు. జాగ్రత్తగా, సంతోషంగా ఉండాలని మెసేజ్ చేశాడు.  ఆ తర్వాత నేను ఫోన్ చేశా.. స్విచ్చాఫ్ వచ్చింది. మెస్సేజ్ చేశా. చూడలేదు. మధ్యాహ్నం 2 గంటలకు టీవీల్లో న్యూస్ వచ్చింది. తండ్రి చనిపోయాడని పిల్లలకు తెలియలేదు. డోర్ కొడితే డాడీ వచ్చాడని పాప సంతోష పడేది. వారం రోజుల్లో తేజ వస్తాడని పాప ఎదురు చూస్తోంది. తేజ బయటకు వెళ్లేటప్పుడు పాపను చూసే వెళ్తాడు.’’ అని చెప్పారు. 



Updated Date - 2021-12-10T01:26:29+05:30 IST