బాలిక love ప్రతిపాదన తిరస్కరించిందనే కోపంతో యువకుడి దారుణం

ABN , First Publish Date - 2022-06-01T18:10:44+05:30 IST

తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో 22 ఏళ్ల యువకుడు ఆమెను 14 సార్లు కత్తితో పొడిచాడు....

బాలిక love ప్రతిపాదన తిరస్కరించిందనే కోపంతో యువకుడి దారుణం

తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిలో 16 ఏళ్ల బాలిక తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో 22 ఏళ్ల యువకుడు ఆమెను 14 సార్లు కత్తితో పొడిచాడు. ఆ యువకుడిని కేశవన్‌గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.తిరుచ్చిలోని అతికుళంలో నివాసముంటున్న బాలిక 11వ తరగతి చదువుతోంది. పరీక్షలు ముగించుకుని బాధితురాలు తన బంధువుల ఇంటికి వెళుతుండగా రైల్వే ఓవర్‌పాస్ సమీపంలో నిందితుడు కేశవన్ ఆమెను అడ్డుకున్నాడు.2021జూన్ నెలలో అదే బాలికను కిడ్నాప్ చేసినందుకు కేశవన్‌పై బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం 2012 (పోక్సో) కింద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బాధితురాలి బంధువు పేర్కొన్నారు. అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు.బాలిక నిరాకరించడంతోపాటు ఆమె సాయం కోసం కేకలు వేయకముందే కేశవన్ ఆమెను 14 సార్లు కత్తితో పొడిచాడు. 


అనంతరం కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు.బాలిక కిందపడిపోవడంతో ఆమె శరీరం నుంచి రక్తం కారడాన్ని గమనించారు. వారు వెంటనే బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.నిందితుడిని తిరుచ్చి పోతామెట్టుపట్టికి చెందిన కేశవన్‌గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.ఈ ఘటనపై కరూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి ట్వీట్‌ చేస్తూ.. ఓ పాఠశాల విద్యార్థిని 14 సార్లు కత్తిపోట్లకు గురైందని విని షాక్‌కు గురయ్యానన్నారు. కేశవన్‌ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.




Updated Date - 2022-06-01T18:10:44+05:30 IST