TS News.. బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్‌కు మద్దతు: తమ్మినేని వీరభద్రం

ABN , First Publish Date - 2022-09-07T19:50:15+05:30 IST

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు.

TS News.. బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్‌కు మద్దతు: తమ్మినేని వీరభద్రం

యాదాద్రి (Yadadri): మునుగోడు (Munugodu) ఉపఎన్నికల్లో (By Election) బీజేపీ (BJP)ని ఓడించడానికే టీఆర్ఎస్ (TRS) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) స్పష్టం చేశారు. బుధవారం సంస్థాన్ నారాయణపురం మండలం, పుట్టపాకలో సీపీఐ (ఎం) మునుగోడు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా రాజ్యాంగ హక్కులను, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ బీజేపీ దేశంలో దుర్మార్గ పాలన చేస్తోందని విమర్శించారు. దేశంలో అన్ని మతస్థులు ఎప్పటి నుంచో ఉంటున్నా.. మైనార్టీలు ఈ దేశంలో ఉండొద్దని బీజేపీ మత ఘర్షణలను రెచ్చ గొడుతోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను లాక్కుంటూ కేంద్రం నియంత పాలన చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడు సభలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సాయుధ పోరాటాలు సాధించిన  తెలంగాణ గడ్డ మీదికి బీజేపీ పార్టీని ఎదగనీయకుండా చేయడమే సీపీఐ ఎజెండా అని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-07T19:50:15+05:30 IST