తానా 2021 ఎన్నికలు.. నిరంజన్ శృంగవరపు సుడిగాలి పర్యటన!

ABN , First Publish Date - 2021-03-14T22:17:23+05:30 IST

తానా 2021 ఎన్నికల బరిలో నిరంజన్ శృంగవరపు నిలిచారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ శనివారం రోజు డీఎఫ్‌డబ్ల్యూ

తానా 2021 ఎన్నికలు.. నిరంజన్ శృంగవరపు సుడిగాలి పర్యటన!

వాషింగ్టన్: తానా 2021 ఎన్నికల బరిలో నిరంజన్ శృంగవరపు నిలిచారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ శనివారం రోజు డీఎఫ్‌డబ్ల్యూ మెట్రోలో సుడిగాలి పర్యటన జరిపింది. స్థానిక ప్రవాస తెలుగు ప్రముఖుడు మల్లవరపు అనంత్ నివాసంలో సౌత్‌లేక్ ప్రాంత ప్రవాసులను కలుసుకుని మద్దతుకోరింది. అనంతరం అర్వింగ్‌లో కృష్టా జిల్లా ప్రవాసలను కూడా నిరంజన్ శృంగవరపు ప్యానెల్ కలిసింది. ఆ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ.. తన పూర్వీకులది కృష్టా జిల్లా అనీ.. అయితే తాము కర్నూలులో స్థిరపడ్డట్టు వివరించారు. తానాలో కృష్ణా జిల్లా ప్రవాసులది ప్రత్యేక స్థానమని ఆయన కొనియాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు డా. కాకర్ల సుబ్బారావు మొదలుకొని చాలా మంది కృష్ణా జిల్లా ప్రవాసులు తానాలో కీలక పదవులు చేపట్టి సంస్థను ముందుకు నడిపించినట్టు చెప్పారు. మేలో జరిగే ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని ప్రవాసులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అభ్యర్థులు డా. ఉమా కటికి, శిరీష తూనుగుంట్ల, శశాంక్ యార్లగడ్డ, నిమ్మలపూడి జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. నిరంజన్ శృంగవరపు ప్రస్తుతం తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. 


Updated Date - 2021-03-14T22:17:23+05:30 IST