TS News: ట్యాంక్బండ్పై మంత్రి తలసాని, మేయర్ పర్యటన
ABN , First Publish Date - 2022-09-07T22:17:13+05:30 IST
ట్యాంక్బండ్ (Tankbund)పై మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas), మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు.
హైదరాబాద్: ట్యాంక్బండ్ (Tankbund)పై మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas), మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని విమర్శించారు. బాలాపూర్ వినాయకుడి నుంచి ఖైరతాబాద్ వినాయకుడి వరకు.. నగరంలో అన్ని విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని తెలిపారు. నిమజ్జనం ఏర్పాట్లపై అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేశామని తలసాని శ్రీనివాస్ తెలిపారు.