Puneలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-10-23T13:02:18+05:30 IST

మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Puneలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి దుర్మరణం

మరో 11మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు

పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణే నగరంలోని కట్రాజ్-ముంబై రోడ్డుపై నవ్లీ బ్రిడ్జి వద్ద వేగంగా వస్తున్న ట్యాంకర్ సెవెన్ సీటరు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెయింట్ పరిశ్రమకు చెందిన థిన్నరును ముంబైకు తీసుకువెళుతున్న ట్యాంకర్ నవ్లీ బ్రిడ్జీపై సెవెన్ సీటరు వాహనాన్ని దాటబోయి ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడే మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెవెన్ సీటరు ఆటోలో ఉన్న వారు ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక పాదచారి కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో ముంబై రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.


Updated Date - 2021-10-23T13:02:18+05:30 IST