బాలికపై తాంత్రికుడి కొడుకు అత్యాచారం.. ఎవరికైనా చెబితే పూజలు చేసి చంపేస్తానని బెదిరింపు.. చివరకు అసలు విషయం ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2022-01-30T18:18:19+05:30 IST

ఆ గ్రామంలో ఉండే 16 ఏళ్ల బాలికపై తాంత్రికుడి కొడుకు కన్ను పడింది..

బాలికపై తాంత్రికుడి కొడుకు అత్యాచారం.. ఎవరికైనా చెబితే పూజలు చేసి చంపేస్తానని బెదిరింపు.. చివరకు అసలు విషయం ఎలా బయటపడిందంటే..

ఆ గ్రామంలో ఉండే 16 ఏళ్ల బాలికపై తాంత్రికుడి కొడుకు కన్ను పడింది.. ఆమె గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు.. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లాడు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెబితే తాంత్రిక పూజలు చేసి అందర్నీ చంపేస్తానని బెదిరించాడు.. దీంతో ఆ బాలిక సైలెంట్‌గా ఉండిపోయింది.. ఏడు నెలల తర్వాత ఆరోగ్యం బాగోలేదని హస్పిటల్‌కు తీసుకెళితే షాకింగ్ విషయం తెలిసింది.. బాలిక గర్భవతి అని తేలింది. 


రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి సమీపంలో బరాన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన తాంత్రికుడి కొడుకు కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తాంత్రిక పూజలు చేసి ఇంట్లో వారందరినీ చంపేస్తానని బెదిరించాడు. భయపడిన ఆ బాలిక ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. గత గురువారం ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ బాలికను కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. 


స్కానింగ్ తీసిన వైద్యుడు ఆమె ఏడో నెల గర్భవతి అని తేల్చాడు. ఏం జరిగిందని అడగ్గా.. ఆ బాలిక అసలు విషయం బయటపెట్టింది. తాంత్రికుడి కొడుకు అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

Updated Date - 2022-01-30T18:18:19+05:30 IST