చంద్రబాబు సభకు తరలిన టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-05-19T05:47:36+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం కడపకు వస్తుండడంతో రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు

చంద్రబాబు సభకు తరలిన టీడీపీ శ్రేణులు
లక్కిరెడ్డిపల్లె: టీడీపీ సమావేశానికి బయలుదేరిన రమే్‌షకుమార్‌రెడ్డి

లక్కిరెడ్డిపల్లె, మే18: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం కడపకు వస్తుండడంతో రాయచోటి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి రమే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు.  మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, మాజీ మార్కెట్‌ చెర్మన్‌ గాజుల ఖాదర్‌బాషా, అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, నాగిరెట్టి, టీడీసీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జయరాం, వాసుదేవుడు. వెంకట్రామిరెడ్డి, నాయకులు తరలివెళ్లారు.
రామాపురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తుండడంతో బుధవారం  1000 మందికిపైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కడప కు తరలివెళ్లినట్లు మండల టీడీపీ నాయకుడు గడికోట భాస్కర్‌రెడ్డి తెలిపారు.
వీరబల్లి:  వీరబల్లి మండలం నుంచి పార్టీ నాయ కులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కడపకు తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు భానుగోపాల్‌ రాజు, ఉపాధ్యక్షుడు దుర్గం ఆంజినేయులు, మహిళా అధ్యక్షురాలు నాగసుబ్బమ్మ, వీరబల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, గుర్రప్పగారిపల్లె, ఓదివీడు గ్రామ కమిటీల అధ్యక్షులు ప్రభాకర్‌నాయుడు,  వెంకట్రామరా, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2022-05-19T05:47:36+05:30 IST