ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తాం
ABN , First Publish Date - 2021-04-23T10:36:39+05:30 IST
ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తాం
మావోయిస్టు పార్టీ విశాఖ- ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ లేఖ
పాడేరు, ఏప్రిల్ 22: ఏజెన్సీలో పోలీసులు నిర్బంధ చర్యలను ఆపకుంటే ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తామని మావోయిస్టు పార్టీ విశాఖ-ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ హెచ్చరించారు. ప్రజా పీడకులైన నేతలకు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల గతే పడుతుందన్నారు. ఆమె పేరిట గురువారం స్థానిక మీడియాకు ఒక లేఖ అందింది.