బీఆర్ఎస్తో కేసీఆర్కు వీఆర్ఎస్: తరుణ్ చుగ్
ABN , First Publish Date - 2022-06-15T01:49:23+05:30 IST
Hyderabad: బీఆర్ఎస్తో కేసీఆర్కు వీఆర్ఎస్ తప్పదని బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అని పేర్కొన్నారు. ఆయన ఏబీఎన్తో మాట్లాడుతూ.. మోదీకి ప్రత్యామ్నాయంగా తనకు తాను
Hyderabad: బీఆర్ఎస్తో కేసీఆర్కు వీఆర్ఎస్ తప్పదని బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఆయన ఏబీఎన్తో మాట్లాడుతూ.. మోదీకి ప్రత్యామ్నాయంగా తనకు తాను కేసీఆర్ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ‘‘ప్రధాని కావాలని కేసీఆర్ కలలు కనటంలో తప్పు లేదు. మమత, పవార్ , ములాయం లాంటి వారి జాబితాలో కేసీఆర్ చేరక తప్పదు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు రెడీగా ఉన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణలో పరిస్థితులు వేగంగా మారతాయి.’’ అని చెప్పారు.