24 క్రయోజనిక్‌ కంటైనర్ల దిగుమతి: టాటా గ్రూప్‌

ABN , First Publish Date - 2021-04-22T07:39:23+05:30 IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు ఉపయోగించే ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లిక్విడ్‌ ఆక్సిజన్‌ను రవాణా చేసేందుకు ఉపయోగించే...

24 క్రయోజనిక్‌ కంటైనర్ల దిగుమతి: టాటా గ్రూప్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులకు ఉపయోగించే ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లిక్విడ్‌ ఆక్సిజన్‌ను రవాణా చేసేందుకు ఉపయోగించే 24 క్రయోజనిక్‌ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్టు టాటా గ్రూప్‌ ప్రకటించింది. వీటి ద్వారా ఆక్సిజన్‌ కొరతను తగ్గించడానికి దోహదపడనున్నట్టు టాటా గ్రూప్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. కాగా, టాటా గ్రూప్‌ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.  

Updated Date - 2021-04-22T07:39:23+05:30 IST