తమిళనాడులో సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ
ABN , First Publish Date - 2022-07-07T00:15:05+05:30 IST
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో solar cells and modules తయారీ యూనిట్ ఏర్పాటుకుగాను రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టే క్రమంలో... తమిళనాడు ప్రభుత్వంతో టాటా పవర్ ఒప్పందం కుదుర్చుకుంది.
* టాటా పవర్ రూ. 3 వేల కోట్ల పెట్టుబడి
చెన్నై : తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో solar cells and modules తయారీ యూనిట్ ఏర్పాటుకుగాను రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టే క్రమంలో... తమిళనాడు ప్రభుత్వంతో టాటా పవర్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీలలో ఒకటైన టాటా పవర్... తిరునల్వేలి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ 4GW సోలార్ సెల్, 4GW సోలార్ మాడ్యూల్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పేందుకు సుమారుగా రూ. 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(MoU)పై Tata Power సంతకం చేసింది. ప్లాంట్లో పెట్టుబడి 16 నెలల వ్యవధిలో జరగనున్నట్లు, ప్రత్యక్షంగా, లేదా... పరోక్షంగా రెండు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని టాటా పవర్ వర్గాలు వెల్లడించాయి.
ఉపాధి పొందనున్న వారిలో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారని తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీనియర్ అధికారుల సమక్షంలో తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి ఎస్ కృష్ణన్, పరిశ్రమల శాఖ, టాటా పవర్ సీఈఓ & ఎండీ ప్రవీర్ సిన్హా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. టాటా పవర్ CEO & MD ప్రవీర్ సిన్హా ‘భారతదేశం తన ఇంధన అవసరాలను తీర్చడానికి స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వినియోగానికి కి నాయకత్వం వహించే అవకాశముంది’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.