పన్నుల పెంపుదలపై అఖిలపక్షం ధర్నా
ABN , First Publish Date - 2021-06-16T05:51:49+05:30 IST
ఆస్తి పన్ను, చెత్త, నీటిపన్నుల పెంపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 15 : ఆస్తి పన్ను, చెత్త, నీటిపన్నుల పెంపు నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలైన పన్నులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం డీఎంహెచ్ స్కూల్ సమీపంలోని సచివాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, టీడీపీ నాయకుడు కాశి నవీన్, బీఎస్పీ నగర అధ్యక్షుడు ఇసుకపట్ల రాంబాబు, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కె. జోజి, సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.