TDLP Meeting: టీడీపీ శాసనసభా పక్ష సమావేశం నేడు
ABN , First Publish Date - 2022-09-14T17:55:26+05:30 IST
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో...
విజయవాడ (Vijayawada): ఏపీ అసెంబ్లీ (AP Assembly) వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ శాసనసభా పక్షం బుధవారం సమావేశం కానుంది. మూడు రాజధానుల వైపు ప్రభుత్వ అడుగులపై చర్చ, సీఐడీ తాజా అరెస్టులు, తదితర అంశాలపై టీడీఎల్పీ చర్చించనుంది. రైతుల పాదయాత్ర సమయంలో కేసులు.. ఉద్దేశపూర్వకమేనని టీడీపీ ఆరోపించింది. లావాదేవీలే జరగని అంశాల్లో అక్రమ కేసులపై మండిపడింది. సంబంధం లేని సెక్షన్లు అంటూ ఇప్పటికే రిమాండ్ తిరస్కరించిన కోర్టు, తప్పుడు సెక్షన్లు పెట్టిన సీఐడీ అధికారులపై ప్రైవేట్ కేసులకు కసరత్తు, వైజాగ్ రాజధాని అంటూ మరో వైపు స్పీడు పెంచిన జగన్, కీలకంగా మారనున్న అసెంబ్లీ సమావేశాలు.. వీటన్నింటిపై సమావేశంలో చర్చించి.. టీడీపీ నేతలు ప్రతివ్యూహం సిద్ధం చేయనున్నారు.