టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ భేటీ

ABN , First Publish Date - 2022-03-08T02:27:33+05:30 IST

టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ భేటీ అయింది. బీఏసీలో

టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ భేటీ

అమరావతి: టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ భేటీ అయింది. బీఏసీలో సీఎం వ్యాఖ్యలను చంద్రబాబుకు  అచ్చెన్న వివరించారు. ఈనెల 9న అకారణంగా సభకు విరామం ఇవ్వడంపైనా చర్చ  జరిగింది. మంత్రి బొత్స కుమారుడి రిసెప్షన్ కోసం ఈనెల 9న సభకు సెలవు ఇవ్వడాన్ని టీడీఎల్పీ తప్పుబట్టింది. నేతల ఇంట్లో ఫంక్షన్‌ కోసం సభకు సెలవు ఇస్తారా అంటూ మండిపడింది. వింత పోకడలతో సభా గౌరవం తగ్గేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీఎల్పీ నేతలు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలపై ప్రభుత్వ దాడిని గవర్నర్ అడ్డుకోలేకపోయారన్నారు. గవర్నర్ ప్రసంగం వేళ నిరసనల్లో తప్పేమీ లేదని నేతలు పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-08T02:27:33+05:30 IST